సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు:
తాటిపాముల మృత్యుంజయుడు
సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
చెన్నాప్రగడ కృష్ణ
పుంభావ సరస్వతి, సంగీత త్రిమూర్తుల రూపంలో 86 సంవత్సరాలు నడయాడిన పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణంతో కర్ణాటక సంగీత కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. త్యాగరాజ, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి కీర్తనలే కాకుండా, జయదేవుని కీర్తనలు, థిల్లానా, ఇతర సంగీత మహామహులతో చేసిన జుగల్బందీలు, చేసిన స్వర కల్పనలు సంగీత ప్రపంచంలో కలకాలం నిలచిపోతాయి. జానపద శైలిలో పాడిన 'ఏమి సేతుర లింగా' కీర్తన పండిత పామరులకు చేరువయ్యింది. సినిమాల్లో వారు పాడిన పాటలన్నీ గొప్పగా పేరొందాయి. ఆంతటి శిఖరాగ్రం ముందు తల వొంచి ప్రణమిల్లుతున్నది సిలికానాంధ్ర సుజనరంజని.
ఆవిష్కరణం
పదిహేను సంవత్సరాలనుండి అంచెలంచెలుగా ఎదుగుతున్న సిలికానాంధ్ర కొత్త చిహ్నాన్ని (Logo) ఆవిష్కరించింది. వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' చూడండి.
కొన్ని ముచ్చట్లు
ఐదు సంవత్సరాలకు పైగా పాఠకుల మనస్సును దోచుకున్న 'సత్యమేవ జయతే' శీర్షిక ఈ నెలతో ముగుస్తున్నది. మనోరంజకంగా రాసిన చేయి తిరిగిన రచయిత మందపాటి సత్యం గారికి సిలికానాంధ్ర కృతజ్ఞతలు తెలుపుతున్నది. అలాగే మరొక అంతర్జాల పత్రిక కౌముది కథల పోటీ నిర్వహిస్తున్నది. వివరాలకు 'జగమంత కుటుంబం' శీర్షిక చూడండి.
- తాటిపాముల మృత్యుంజయుడు