సుజననీయం

మూడు, నాలుగు, 6327 మరియు 2015


- తాటిపాముల మృత్యుంజయుడు


ఇది అంకెల గారడీ కాదు. మన కన్నుల ముందు జరిగిన సత్యం. మూడు రోజుల పాటు డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో సిలికానాంధ్ర నాల్గవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆఖరి రోజున 6327 కళాకారులు పాల్గొన్న మహాబృందనాట్యం సరికొత్త గిన్నీస్ రికార్డును నెలకొల్పింది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మన్నలను పొందింది. కూచిపూడి నాట్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు తేవడానికి మరొక ముందడుగు వేసింది.

2015 నూతన సంవత్సరంలో సిలికానాంధ్ర కుటుంబ సభ్యులకు, సుజనరంజని పాఠకులకు అంతా మంచి జరగాలని సిలికానాంధ్ర సంస్థ కోరుకుంటున్నది. రచయితలు, రచయిత్రులు మంచి రచనలను పంపండి. పాఠకులు పఠనాభిలాషను పెంపొందించండి. నలుగురితో పంచుకోండి.

జై తెలుగు! జై సిలికానాంధ్ర!!

శుభం భూయాత్!!!

- తాటిపాముల మృత్యుంజయుడు




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)