వచన కవితా ప్రక్రియ - కుందుర్తి కృషి

-- డా. అద్దేపల్లి రామమోహన రావు

శిష్ట్లా, శ్రీశ్రీ,నారాయణ బాబు, పఠాభి - మొదట్లో వచన కవితకి ఒక రూపమిచ్చినట్లుగా సాహిత్య విమర్శకులు పేర్కొంటారు. వచన కవిత అనేది పాశ్చ్యాత్య కవితా ప్రభావం వల్లనే వచ్చింది. దీన్ని ఫ్రీ వర్స్ అంటారు. ఫ్రీ - అంటే అన్ని సంకెళ్ళనూ తెంచుకుని, స్వేచ్చగా భావాన్ని వెల్లదించే ధోరణి. దీని అవసరానికి సంబధించిన ముక్యాంశాలు కొన్నిటిని విశ్లేషింవచ్చు.

  • 1. గతులు, యతి, ప్రాస మొదలైన చందస్సుకి సంబందించిన నియమాల్ని విడిచి పెట్టడం.
  • 2. పూర్తిగా ప్రజలు వాడుకునే వ్యావహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వడం.
  • 3. వాక్యాల్ని మాట్లాదుకునే క్రమంతోనే రాయడానికి అవకాశం రావడం.
  • 4. ఎటువంటి శిల్పానికైనా ఏ కష్టం లేకుండా ప్రయోగించడం
  • 5. పాదాలుగా విరవడంలో ఒక్కొక్క సంపూర్ణ భావానికి ప్రాధాన్యమివ్వడం.
ముఖ్య్మైన విషయాలు ఇవి కాగా, ఆత్మ లక్షణం 'భావభారా కవి లోని భావాల ధార మాత్రమే ప్రధానమై, మిగిలిన ఏ ఆటంకాలు లేకపోవడం వచనకవిత వల్ల వచ్చిన ఒక గొప్ప ప్రయోజనం.

ఒక ప్రక్రియ నుండి మరొక ప్రక్రియ పరిణమించేడపుడు పాత ప్రక్రియ తాలూకు అవశేషాలు ఒక్కసారిగా తొలగిపోవు. క్రమక్రమగా తొలగిపోతై. అందుకే మొదటి వరసకు చెందిన పై కవుల్లో పద్యంకి సంబధించిన ఎన్నో లక్షణాలు మిగిలి ఉనాఇ. వాటిని ఈ క్రింది విధంగా వింగడించవచ్చు.

  • 1. మధ్య మధ్య లో అనేక గజాలు లయ బధ్ధంగా కనిపిస్తూ ఉండడం
  • 2. అక్షరాల సంఖ్యని బట్టి కాకుండా ఎక్కడో ఒక చోట యతి రావడం
  • 3. నియమాల్ని బట్టి కాకుండాఆ ప్రాసలు అంత్య ప్రాసలు తరచుగా రావడం
  • 4. సంస్క్రుత భాషనూ, సమాసాల్ని విరివిగా ప్రయోగించడం
  • 5. సంక్లిష్టమైన భావాల్ని, శైలిని కూడా అనుసరించడం
ఇలాటివన్నీ పై కవుల్లో తరచుగా గమనించవచ్చు.

వచన కవిత ప్రజల భావాల్ని ప్రజలకి చెప్పడానికి చాలా అనువైన రూపం. దీనికి భినామైన లక్షణాలు కూడా పై వారిలో కొంత వరకు ఉన్నై. సామాజిక వస్తువును కాకుండా ఎటువంటి ప్రయోగాత్మక భావరీతికైనా వచన కవితలో చెప్పే అవ్కాశం ఉంది. కాని ఒక రూపం ముందుగా బయల్దేరడానికి ఒక ప్రధానమైన కారణం ఉంటుంది. వచన కవిత, కవిత్వాన్ని ఉన్నతమేధా స్థాయి నుండి, ప్రజాప్రయోజకరమైన స్థాయికి తీసుకురావడానికే ఉడ్డేశింపబడింది.

కవులు, తమతమ లక్ష్యాలతో, కవిత్వాన్ని రాస్తూ ఉన్న సమయంలో, కొంత కాలానికి గాని స్థిరమైన విశ్లేషలూ, నిర్దేశాలూ, నిశ్చిత నియమాలూ ఏర్పడవు. అలా శిష్ట్లా కవులు రాస్తున్న వచనకవితకి, 1958 ప్రాంతాలనుండి వివేచనాత్మక విశ్లేషణలు ప్రారంభమైనై. ఈ సమయంలో ఈ అవసరాన్ని నేపధ్యంల్గా తీసుకొని, వచన కవితకు వస్తు, శిల్ప పరమైన స్థిరీకరణ కోసం ప్రయత్నించిన వారిలో 'కుందుర్తీ ముఖ్యమైనవారు. ఆయన వచన కవితకు అనువైన లక్ష్ణాల్ని ప్రతిపాదిస్తూ, వ్యాసాలు రాస్తూ, ఆ లక్ష్యంతోనే ఎన్నో వచన కవితల్న్ని రాసినవారు. ఎంతోమంది చేత వ్యాసాలు రాయించినవారు.

'పాతకాలం పద్యమైతే

వర్తమానం వచనగేయం'


అన్నది ఆయన ప్రసిధ్ధ్మైన నిర్వచనం.

వచన కవిత అనేది ఆ తర్వాత వచ్చిన పదమేగాని, కుందుర్తి కాలంలో 'వచనగేయం' అనే మాటె ఎక్కువగా ప్రయోగించేవారు. అంతకుముందు 'వచన పద్యం' అనేవారు. కాలక్రమాన వచన కవిత అనే పదం వచ్చింది. ఈ నాడైతే 'కవితా అంటే వచన కవిత అనే అర్ధం. కుందుర్తి వచన కవిత్వాన్ని విదేశ ప్రభావంవల్ల వచ్చిందని అంగీకరించడు. భావావిష్కరణలోని సహజణామం మాత్రమే ఇందుకు కారణ మంటాడు. ఒక వ్యాసంలో ఆయన ఇలా అంటాడు.

'పద్యం మాత్రా చందస్సు, ఫ్రీ వర్స్ - ఇదొక సహజ పరిణామం. విదేశాలలో ఈ పధ్ధతి ఉండవచ్చు. అంత మాత్రాన విదేశాల నుండి దిగుమతి చేసుకున్నదిగా ఫ్రీ వర్స్ను చూడనవసరం లేదు. అది నా దృష్ఠి. సుప్రసిధ్ధ కవులు దీనిని ఎందుకు అనుసరిస్తున్నారంటే, ఇదొక నూతన ప్రయోగం కాబట్టి. ఏ కాలంలో నైనా పాతరీతులను పగులగొట్టవలసిందే. కొత్త బొమ్మలు చెక్కవలసిందే.'

వచన కవితకు కుందుర్తి ఒక ఉద్యమంగా భావించాడు. కవులందరూ, సామాజిక వస్తువు కోసం వచన కవితను రాయడం బాగా ఎక్కువైన కాలంలో కుందుర్తి, ఆ అధిక్యాన్ని సూచించడానికే దాన్ని ఉద్యమం అన్నాడు. ఆ రోజుల్లో కొందరు, ఒక రూపమే ఉద్యమమెలాగౌతుంది అనిగూడా ప్రశ్నించారు. అయితే, ఆయన దీన్ని సామజిక ఉద్యమమనే అర్ధంలో అనలేదనీ, సామాజిక వస్తువినియోగంలో అత్యంత ప్రసవితం కావడాన్నే ఉద్యమంలాంటిదిగా చెప్పాననీ అన్నారు. 'భావ కవితోద్యమా మొదలైన చోట్ల ఉన్న అర్ధంలోనే ఈ సందర్భాన్ని కూడా గ్రహించవచ్చు.

కుందురి దృష్ఠి పూర్తిగా సామాజిక వస్తుపరమైనదే. సమాజం లోని సమస్యల్ని మాత్రమే వచన కవితలో చెప్పాలని కుందుర్తి వాదం. 'వచన గేయం ఒక ఉద్యమం' అనే వ్యాసంలో ఆయన ఇలా అంటాడు.

'ప్రజా జీవితాలను సర్వసమగ్రంగా చిత్రించే ప్రయత్నించడం ఆధునిక కవితా లక్షణం. అందుకే వచన గేయాన్ని ఆశ్రయించవలసివచ్చింది. సంఘంలో పై అంతస్తులంకు మాత్రమే పరిమితం కాకుండా, కిందికిదిగి సామాన్య ప్రజల మధ్య నిలబడి చిత్ర విచిత్ర మైన, బహు క్లిష్టమైన, ఆధునిక జీవితంలోని వివిధ ఘట్టాలను వర్ణిచాలంటే, అది ఒక వచన గేయమే చేయగలదు!

కుందుర్తి సామ్యవాద ఉద్యమాల్లోంచి రూపు దిద్దుకున్న అభ్యుదయ కవి. అందుకే వర్గ దృష్ఠి ఆయనకు అన్నిటికంటే ముఖ్యమైన అంశం.

వచన కవితలో ఉన్న మరో గొప్ప అవకాశాన్ని గూడా ఆయన గర్హించాడు. అదే 'కధా కవితా. వచన కవిత సుస్థిరం కావాలంటే, ఈ రూపంలో దీర్ఘ కధా కావ్యాలు రావాలని ఆశించాడు. ప్రాచీన కావ్యాల్లో ప్రాచీన జీవితానికి సంబధించిన కధా కావ్యాలు వచ్చినై కనుకనే వాటికి స్థిరత్వం వచ్చింది కాబట్టి, ఆధునిక కావ్యాల్లో ఆధునిక జీవితానికి సంబంధించిన కధా కావ్యాలు వస్తే, అది వచన కవితని స్థిరరూపంగా చేస్తుందని ఆయన వాదించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే,

'నేటి వరకూ వచన గేయం కవితా బండికల రూపంలోనే కలం గడుపుతున్నది. సంపూర్ణ కావ్య దృష్టి అలవరచు కోలేదు. శ్రవ్య కావ్యం సమగ్రంగా ఉండాలంటే జీవితంలోని వివిధ సంఘటనల చిత్రణ, పారల స్వభావ పరిశీల ఉండాలి. అంటే నాటకీయత ఉండాలి. సామాన్య ప్రజల క్ధా వస్తువులను తీసుకుంటే వచన గేయం చేయలేని పని అంటూ ఉండదు. పూర్వ చందస్సులను త్రోసిరాజన్నందుకు ప్రతిఫలంగా మహా కావ్యాలు సృష్తించవచ్చు.'

దీర్ఘ కధాకావ్యాల గురించి, కుందుర్తి ఊహ అనంత కాలంలో మరో విధంగా సఫలమయింది. కధ, పాత్ర, నాటకీయత మొదలైనవాటి కోసం కధలూ, నాటకాలూ, నవలలూ మొదలైనవి అసంఖ్యాకంగా వచ్చినై కాబట్టి, కధ లేకపోయినా, భావాల్ని విస్త్రుత రూపంలో చిత్రించే 'దీర్ఘ కవితా అనే రూపం వచన కవితా పరిణామంలో విశిష్ట రూపంగా బయటికి వచ్చింది. అన్ని రంగాల్ని గురించి విస్త్రుతంగా, వివరంగా చెప్పాలనే తపన కవిలో పెరగడం ఇందుకు కారణం. మొదట్లో కవి కవిత్వాన్నే చెప్పాడు గాని, ఆధునిక కాలంలో రాజకీయం, చరిత్ర, శాస్త్రజ్ఞానం మొదలైన అనేక అంశాలు కవి ప్రధాన చైతన్యంలో మిళితమై పోయినై. ఈ సమగ్ర చైతన్యమే దీర్ఘ కవిత రావడానికి ముఖ్య కారణం. అంతే కాక కవిలో వక్త, ప్రవక్త కూడా తమకు తగిన స్థానంలో కలిసిపోయారు. ఈ నేపధ్యమంతా ప్రభావితం చెయ్యడం వల్ల, వచన కవితా ఖండికలే కాక, దీర్ఘ కవిత కూడా వచన కవితా పరిణామంలో ఒక ముఖ్య భాగమయింది.

కుందుర్తి తాను నిర్దేశించిన అభిప్రాయాలకనుగుణంగానే, తన కవిత్వమంతటినీ రాశాడు. ప్రజా సంబంధమైనవస్తువు, ప్రజా సంబంధమైన భావన, భాష, అలంకారం - ఇవన్నీ ఆయన్ని సంపూర్ణ ప్రజాకవిగా మలచినై. ఉదాహరణకి 'నగరంలో వాన' నుండి కొన్ని పంక్తులు.

కవిత్వంలా ఊహాంచలాల్లో కదిలాడుతున్నట్లు

జల్లులుజల్లులై కురుస్తుంది

ఆశుకవితలో నగర ప్రజలకు

ఆశీస్సులు పలుకుతున్నట్లు

అనంత ధారా సమేతంగా అంబరం మెరుస్తుంది

నగరంలో వాన

అంబరానికి అంతసంబరమెందుకంటే

నున్నగా తెల్లగా తళతళలాడే

సిమెంట్ రోడ్ల అద్దాలలోకి

మింటె నుండి మెడలువంచి చూసి

తమ అందం చినుకుల కుప్పలుగా పోసి

అంతులేని ఆకాశమంత ఆనందంతో

మెలికలు తిరుగుతూ మిలా మిలా మెరుస్తాయి మేఘాలు

పై పాదాల్లో అతి సరళమైన భాష. తేలికైన వాక్యాలు. భావ చిత్రాలు కూడా ఏ మాత్రమూ క్లిష్టమైనవికాక వెంటనే అనుభూతి కలిగించేది.

వచన కవితలో ఉన్న మరో అభివ్యక్తి అవ్కాశాన్ని కూడా కుందుర్తి చెప్పాడు. అది 'విసురూ అనే లక్షణం. భావాన్ని తీవ్రతతో చెప్పవలసి వచ్చినప్పుడు, దీర్ఘ వాక్యాల విరుపులు, పాదాల చివర క్రియా పదాలు కుండ పోతగా వచ్చే ఉపమానాలు మొదలైన వాటి వరుసలు ఈ విసురును ప్రతిబింబిస్తై. కుందుర్తి, గోపాలచక్రవర్తి కవిత నుండి ఒక ఉదాహరణిస్తాడు.

'ఆకసం నిండా మేఘాలు

వేలాడే ఏంగులవలె

దేవ వేశ్య ఊర్వశి శిరోజాలవలె

ఉన్మత్త మనో వల్మీకంలో

ఊర్ధ్వంగా ప్రసరించే

వేడివేడి మజా తలపులవలే

'విసురూ కాకుండా 'భావలయా అనే మరో లక్ష్ణాన్ని కూడా వచన కవితలో ఉండాలని కుందుర్తి చెప్తాడు. చందస్సుకి సంబంధించిన లయలో కాకుండా, భావాలు తీర్చడంలో, లయ 'భావలయా. దీని కుదాహరణగా కుందుర్తి చెప్పిన నాలుగు పాఠాలు

'నాకీలోకం మీద అంతగా మమకారం లేకపోయినా

ఇదిమాత్రం నన్నొదిలేట్లులేదు

లోప్పలు ఎత్తి చూపితే ప్రయోజనం లేకపోయినా

ఈ కవిత్వపు పాటలవాటుతో మనసేఊరుకోదూ

ప్రాచీన చందోలక్షణాల్నించి వచన కవిత పరిగమించడంలోని అనే అంశాల్ని గూర్చి కుందుర్తి చెప్పారు. అయితే, ఆయన కవిత్వం ఎంత స్వేచ్చా లక్షణాల్ని ప్రతిబింబించినా, కొద్దిపాటి అవశేషాలు ఆయన్లోనూ మిగలకుండా పోలేదు. ప్రతి కవితకీ ఆయన కొన్ని భాగాలుగా విభజిస్తాడు. ఒక భాగంలో రెండు, ఒక భాగంలో మూడు, మరో భాగంలో ఐదు - ఇలా ఎన్ని విధాలుగానైనా ఉండవచ్చు. కాని భాగాలుగా విభజించడం కూడా ఒక ప్రయత్న పూర్వకమైన అంశమే. అంతేగా 'భావలయా కూడా చందస్సుతో పనిలేకపోయినా, ప్రత్యేకంగా ఆలోచించి చెయ్యవలసిన విషయమే. 'భావధారా అనేది ప్రధాన లక్షణంగా తీసుకొంటే, భావంతోపాటు శైలె నడచిపోవాలిగాని, ఒక 'తీర్పూ అనేది ఉందరాదు. ఎక్కడైనా భావానుగుణమైన తీర్పుకి విసురు, భావలయ మొదలైనవి సహకరించవచ్చు. కాని వీటిని లక్షణాలుగా చెప్పడం తర్వాత కాలంలో నిలబడిన విషయం కాదు. 'భావధ్హరా మాత్రమే వచన కవితకి ఆత్మ వంటి లక్షణం.

తిలక్, అజంతా, ఆరుద్ర,, అప్పుడు వచన కవితకి ఎన్నో నడకల్ని నేర్పితే, తర్వాతి కాలంలో వేగుంట, నగ్నముని, సి. వీజయలక్ష్మి, దిగమర కవులు, అద్దేపల్లి మొదలైన వాళ్ళు భావధారననుసరించిరాస్తే, ఈనాటి దాకా వచన కవిత వస్తు శిల్పాల్లో ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, వందలాది ప్రతిభావంతులైన కవులతో, సమకాలీన కవితా ప్రక్రియగా ముందుకు సాగిపోతోంది.