సుజననీయం

 

తెలుగు వెలిగింది

-- తాటిపాముల మృత్యుంజయుడు

అప్పటి సంయుక్తరాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన ఏడోతరగతి తెలుగువాచకంలో 'తెలుగు వెలుగు' అనే పాఠం ఉంది. అందులో ముఖ్యాంశం తాతయ్య, మనవరాలి మధ్య జరిగే సంభాషణ. మనవరాలిలో తెలుగు నేర్చుకోవాలన్న అభిలాషను గుర్తించి తాతయ్య తెలుగుభాషలోని పద్యాలు, సామెతలు, పొడుపుకథలు, జాతీయాలను మచ్చుకొకటి ఉదహరిస్తూ తెలుగు నుడికార మాధుర్యాన్ని మనవరాలికి సులభంగా అర్థమయ్యేట్టు చెబుతాడు. మనవరాలిలో తెలుగు నేర్చుకోవాలన్న తపనను మరింత పెంచుతాడు.

అయితే, జనవరి నెలలో సిలికానాంధ్ర మనబడి పిల్లలు పైన చెప్పిన మనవరాలి కంటే కొన్ని అడుగులు ముందుకేసారు. తెలుగుభాషలో తాము నేర్చుకొన్న పద్యాలు, గేయాలు, పాటలు, నృత్యాలు, సంగీతం, నాటికల్లాంటి మరెన్నో రూపకాలను ప్రదర్శించి తాతయ్యలనే అబ్బురపరిచారు. మరిన్ని వివరాలకు 'మనబడి ' శీర్షిక చదవండి.

తెలుగు సాహిత్యానికి 'తెలుగు కథ ' పట్టుగొమ్మ. వైవిధ్యమైన ఇతివృత్తాలు గల రచనలను పంపండి. నూతన రచయితలకు ఎప్పుడూ ప్రోత్సాహముంటుంది. అలాగే, హాస్యం తెలుగువాడి నరాల్లో తరతరాలుగా జీర్ణించుకుపోయింది అన్నది నిర్వివాదాంశం. అందుకు, మీనుండి జోకులు కార్టున్లను ఆహ్వానిస్తున్నాం.

తెలుగు సాహిత్యాన్ని చదవండి, చదివించండి!

- తాటిపాముల మృత్యుంజయుడు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)