కవిత్వానికి గుండె ఒక నివాసం .
తలుపు
తీసినప్పుడల్లా ఒక్కో తలపు మనల్ని పలకరిస్తూ బయటకు వెళ్ళిపోయి కవి అయితే అక్షరంగా,,
కాకుంటే ఒక జ్ఞాపకంగా రూపు దాల్చుతుంది..
, కలలు కూడా మనలోని భావాలే అని
తెలుసుకునేది ఒక్క కవి మాత్రమే అనే మాటకు కవిత్వమే సాక్ష్యం.
కవిత్వం లో ఎప్పుడు అభూత కల్పనలు ఉండవు కేవలం అనుభూతులు తప్ప.
తపస్సు చేసుకునే రుషి భావుకుడు కాలేడు.
ఆ తపస్సును గమనించే వ్యక్తి మాత్రం తప్పకుండా కవిగా
మిగిలిపోతాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే కవిత్వం పూజ కాదు.
నైవేద్యం.
కవిత్వంలో ఎన్ని అలలు ఉన్నా జడి మాత్రం ఉండదు.
అంతా నిశ్శబ్దం
...
రేణుక అయోల కవిత్వానికి ఒక ముద్ర ఉంది.
మానవీయ స్పర్శ ఉంది.
వీటన్నిటితో పాటు ఏదో కోల్పోయాననే ఆవేదన ఉంది.
గుండెలో తడి ఉంది.
ఉదాహరణకు కాలం ఎపుడు కధ చెబుతుంది అనే వస్తువును తీసుకొని నా
పేరు
కాలం అనే కవిత రాసారు.
"నువ్వు
నన్ను
తెలుసుకోవాలంటే
/యుగాలతో
సంభాషణ
జరపాలి/మృదువైన
పిల్ల
గాలిని
అడగాలి"
అంటారు.
ఎంత బరువైన భావం
? మొదటిది యుగాన్ని మరొకటి పిల్లగాలిని రెంటినీ సమాన స్వరంలో మనకు చూపారు.
ఇక్కడ యుగం అనేది గతం.
పిల్లగాలి అనేది వాస్తవం,
ప్రస్తుతం.
అంటే మనిషిని గురించి,
కాలాన్ని గురించి విపులంగా తేలపాలంటే రెండు వాస్తవాలను అడిగి
తెలుసుకోవాలి అంటారు.
కాలాన్ని అంచనా వేయడం అంత సులభం కాదంటారు.
అడవిని అంచనా వేయడం చాలా ప్రయాసతో కూడిన పని అంటాను.
ఎందుకంటే అడవి విశాలం,
ఏ
మూలా ఏముందో తెలుసుకోవడం,
ఎలా వెళితే బయటకు వస్తామో తెలుసుకోవడం అనేది చాల కష్టం.
ఒక్కసారి అన్నీ కని
పెట్టగలిగామంటే ఇక అదే స్వర్గం అవుతుంది.
అలాంటిది అడవిలో ఒక రాత్రిని గురించి తెలిపే అరుదైన ప్రయత్నం చేసారు.
ఈ వాక్యాలు గమనించండి
ఆ రాత్రి/
అడవిని
చుట్టుకున్న
వెన్నెల
దీపం/చీకటిని
మింగిన
చందమామ/అడవిలో
నడుస్తున్న
నన్ను
పెనవేసుకున్నాయి//
రహస్యాలను
చేదించాలని
ఉద్వేగం/
కొమ్మ
కొమ్మను
పలకరించాలనే
తపన/చల్లటి
స్పర్శతో
ఆత్రుతగా
నడిచే
నడకలు/పచ్చటి
చీకటి
నీడల్ని
చీల్చే
/
వెన్నెల
పాయలు/
గడ్డి
పొదలు/గుండెను
గుబులు
పట్టించే
కూతలు.. అంటారు
. ఎంత అద్భుతం?
ఈ వాక్యాలు చదువుతుంటే మనం అక్కడే ఉన్నామేమో అనే భావన కలిగించక మానదు.
కవిత్వం అనేది ఒక చిత్రమా?
లేక శిల్పమా
? అనే సంశయం వస్తే ఖచ్చితంగా చిత్రమే అంటారు రేణుక అయోల గారు.
అందుకే వీరి ప్రతి కవితలో ఒక అద్బుతమయిన భావ చిత్రం
కనిపిస్తుంది..
అలాగే వీరి కవిత్వం చదవరులను కట్టి పడేస్తుంది.. హృదయం అనేది ఒక సముద్రం.
అందులో ఎన్నో అలజడులు,
ప్రశ్నలు,
సందేహాలతో పాటు సమాధానాలు కూడా ఉంటాయి.
కాని మనం ఒక్క సమాధానాన్ని మాత్రం వదిలి పెట్టి మిగిలిన వాటిపైనే దృష్టిని
కేంద్రీకరిస్తాము.
కాని ఈ కవయిత్రి సమాధానం వైపు కూడా దృష్టిని పెట్టారు..
చూడండి చిన్న
విత్తు
/
తనకు
తానే
భుమిలోకి
ఒదిగి
/కాలానికి
నమస్కరిస్తూ
లేత
చిగుళ్ళతో/గున
గున
ఎదిగి
పలకరిస్తుంది".
అంటూ
చివరిలో
అంటారు
"చెట్టు
మొదలును
తడుముతుంటే
/
గిలిగింతలు
పెడుతూ/
చిన్నారి
మొలక/
గుండె
గుడిలో
వెచ్చదనపు
పండగ అంటారు.
రోడ్డు వెడల్పులో
కనుమరుగవుతున్న చెట్లను చూస్తూ చలించి రాసిన ఈ భావాలలో నువ్వెంతగా నరికినా నువ్వు నువ్వు పాతిన చోటే మళ్లీ మొక్కై
నిలవక మానదు.
చెట్టు స్వభావం మొలకెత్తడం అనే విషయాన్ని ఎంతో అందంగా తెలియజేసారు.
ఇక్కడో విషయం మనం గమనించాలి.
వీరి కవిత్వం లో సునిశితత్వం దాగుంది.
సున్నితంగా గుండెను స్పృశించే గుణం ఉంది.
గొంతును తీయగా పలికితే పరుష వ్యాఖ్యలు కూడా పరమానందం
కురిపిస్తాయి.
భావనలో ఎలా ఉన్నా పరుషంగా
తోటి మనుషులను ఓదార్చినా
సరే పారిపోయేలా చేస్తాయి.
అందుకే మాట మంత్రం అంటారు.
రేణుక గారు తన మృదువైన స్వరంతో ప్రకృతిని ఎంత ఆదరించారో చూడండి చినుకుల
తెరలో/ తడిసిన
మనసు
శరీరం/
లేడి
పిల్లలా
గంతులు
వేసింది.
తడుస్తున్న
పులా
కొమ్మల్లో
నేను
/
పువ్వునై
తడుస్తుంటాను//
ఎండా
వానా
కలబోసినా
సాయంత్రం/
మబ్బుల్లో
తల
దాచుకున్న
సూర్యబింబం/చినుకు
తడిలో
భూమిని
అల్లుకున్న
సుగంధ
శ్వాస
/ఆవిరి
అవుతున్న
వేడి ఇలా సాగుతుంది వీరి ధోరణి.
కవి ప్రకృతికి దాసుడు అనే వాఖ్యానికి రేణుక గారి కవిత్వం ఒక గొప్ప ఉదాహరణ.
కలమనేది కాలంతో పాటు కదులుతుంది.
జీవితంలో ఎన్నో సంఘటనలు మనల్ని హత్తుకుని నిరంతరం జ్ఞాపకానికి వస్తుంటాయి.
అలంటి కవితలే నీటి బొమ్మ,
మరణమే చరిత్ర,
కొత్త ఉదయం పుట్టుక,
ఊరి ప్రయాణం,
పల్లకీలో
పెళ్ళికూతురు కవితలు.
ప్రతి కవితలో ఆర్ద్రత ఉంది.
మానవత్వం ఉంది.
అన్నిటికంటే ముఖ్యంగా పరిశీలన ఉంది.
కవికి పరిశీలనా ఎంత అవసరమో అంతా రేణుక గారిలో ఉంది అనడం అతిశయోక్తి కాదు.
ఇవన్నీ ఒక ఎత్తైతే.
ఈ గ్రంధం చివరిలో ఒక పది వాక్య
కవితలు ఉన్నాయి.
వాటిలో
కొత్తదనాన్ని మనం గమనిద్దాం.
ఏ కవితైనా,
చిన్నదైన,
పెద్దదైనా,
వాక్యమైనా,
వాటిలో వస్తువుతో ఒడంబడిక ఉండాలి.
అంటే వాక్యానికి,
వాక్యానికి మధ్య సంవిధానం తప్పనిసరి.
ముఖ్యంగా వాక్య కవితలకు చాల అవసరం.
ఆ విషయం ఈ కవయిత్రికి తెలుసు.
తెలుసు కనుకనే ఈ ప్రయోగానికి ప్రాణం పోశారు.
ఉదాహరణగా ఈ వాక్యాలు గమనించండి. ఊడ్చి వెళ్ళిన రోడ్డు మీద పరుచుకున్న బొమ్మ కుంచెలు రంగులు లేని
చిత్రం నేలనంతా కళాత్మకంగా మార్చేసింది.
ఈ వాక్యం లో ఎంత భావన దాగుందో అందరికి తెలుసు.
కళను ఎవరు
ప్రదర్శించినా అది కళే అనే మాట ఇందులో స్పష్టంగా మనకు
అర్థమవుతుంది.
ఆ కవిత అనుసరణ చూడండి.
మధ్యాహ్నం ఎండలో మిల మిలా మెరుస్తూ పాదాల కింద పడిపోకుండా ఆ బొమ్మ తనని తాను
రక్షించుకుంటూ దేవుడి రూపంలో చిత్రకారుడి ఆకలి రంగు
తెలియనీకుండా తెల్లగా మెరుస్తూ,
నిశ్సబ్దంగా చిల్లర నాణాలు మోస్తూ,
వాడి గుండె తడిలో ఒదిగి తనలో తాను నవ్వుకుంటూ,
నేలను నమ్ముకున్న చిత్రం లోపల ఎన్ని మెలికలు తిరిగినా,
ఆకలి చూపులు రాకుండా అచ్చం గుళ్ళో దేవుడిలా గంభీరంగా ఉండిపోతుంది.
ఈ ప్రక్రియ ఎంతో విలక్షణంగా ఉంది..
చదువుతున్నంత సేపు టాగూర్ గీతాంజలి,
తిలక్ అమృతం కురిసిన రాత్రి గ్రంధాలు గుర్తుకు వచ్చాయి.
రేణుక అయోల ఒక
నిర్దిష్టమయిన భావాలు ఉన్న కవయిత్రి.
పదాల పొందిక,
భావాల అల్లిక లో తనకు తానే సాటి అనిపించు కున్నారు.
కవిత్వం ఎలా ఉండాలో అనే ఆలోచన కలిగితే ఒక్కసారి వీరి కవితలను తరచి చూస్తే చాలునేమో అనిపించక మానదు.
వీరి భావాలు మరింత సుగమమై,
మరింత సోయగమై మరో గ్రంధం రావాలని అభిలషిస్తూ అభినందనలు.
ప్రతులకు
:
పాలపిట్ట బుక్స్ 16-1-20//1/1, 403,విజయశ్రీ రెసిడెన్సి ,
సలీం నగర్,
మలక్ పెట్, హైదరాబాద్.-36
ఫోన్
: 040-2778430
వెల:
60
రూపాయలు
|