చికాగో నగరంలో రోజ్ మౌంట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఆటా 25వ మహాసభల్లో వివిధ రంగాల్లో సేవలందించి విజయాలను సాధించిన తెలుగు ప్రముఖులను ఆటా-వంశీ జులై 1న అవార్డులతో సత్కరించారు. దీనిలో భాగంగా అమెరికాతో పాటు 10 దేశాల్లో తెలుగు భాషాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ 6000 మందికి పైగా విద్యార్థులకు తెలుగు భాష నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి కులపతి రాజు చమర్తిని ‘విద్యారత్న’ అవార్డుతో సత్కరించారు. మాతృదేశానికి దూరంగా ఉన్నా మాతృభాషకి దూరం కాకూడదని, రేపటి తరానికి నాయకులైన ఈనాటి పిల్లలకు తెలుగు భాషను నేర్పించడానికి 9 సంవత్సరాల క్రితం సిలికానాంధ్ర మన బడి స్థాపించి 150 మంది పిల్లలతో ఈ కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ సందర్భంగా రాజు చమర్తి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో నిర్వహిస్తున్న మనబడిలో అమెరికా దేశ వ్యాప్తంగా 1200 మంది భాషా సైనికుల తరుపున ఈ అవార్డు అందుకున్నానని, భాష సేవయే భావి తరాల సేవ అన్న స్ఫూర్తితో కృషి చేస్తున్న భాషా సైనికులందరికీ ఈ అవార్డు అంకితమని అన్నారు . సిలికానాంధ్ర మనబడి 2016-17 విద్యా సంవత్సరం ప్రవేశాలు మొదలయ్యాయని, సెప్టెంబర్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.
మనబడి
సిలికానాంధ్ర వైస్ చైర్మన్, మనబడి కులపతి రాజు చమర్తికి విద్యా రత్న అవార్డు
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)